
జయ్ న్యూస్, ఆర్మూర్: ప్రభుత్వం అందిస్తున్న ఉచిత రేషన్ బియ్యం పంపిణీ ఈనెల 30వ తేదీ వరకు కొనసాగుతుందని ఆర్మూర్ తహసీల్దార్ సత్యనారాయణ అన్నారు. బుధవారం ఆయన ఆర్మూర్ పట్టణంలో మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వం ఈసారి 3 నెలల బియ్యాన్ని పంపిణీ చేస్తోందన్నారు. ఈనెల 30 వరకు రేషన్ బియ్యం పంపిణీ చేయాలని మండలంలోని రేషన్ డీలర్లకు ఆదేశాలు ఇవ్వనున్నామన్నారు. కావున రేషన్ కార్డు లబ్ధిదారులు ఆందోళన చెందవద్దన్నారు.