
జయ్ న్యూస్, భీమ్ గల్: భీమ్ గల్ మున్సిపల్ పరిధి నాలుగవ వార్డులో వందరోజుల కార్యాచరణ ప్రణాళికలో భాగంగా హనుమాన్ గుడి వద్ద నిత్యం చెత్త వేసే ప్రాంతంలో చెత్తను తొలగించి కాలనీవాసులతో కలిసి చెత్త వేయవద్దని ప్రతిజ్ఞ చేయించి వారితో మొక్కలు నటించడం జరిగిందని కమిషనర్ గోపు గంగాధర్ తెలిపారు. తప్పనిసరిగా తడి పొడి చెత్తను మునిసిపల్ వాహనానికి అందించాలని, ఎక్కడ కూడా చెత్తను బయట పారేయ వద్దని సూచించారు. అదేవిధంగా వాడు ప్రజలకు తడి చెత్త పొడి చెత్త పై అవగాహన కల్పించారు. వర్షాకాలం దృశ్య కాలనీలోని ప్రాంతాలను శుభ్రంగా ఉంచుకోవాలని, వ్యక్తిగత పరిశుభ్రత తప్పనిసరిగా పాటించాలన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ సిబ్బంది, మెప్మా సిబ్బంది, ఇందిరమ్మ కమిటీ సభ్యులు పాల్గొన్నారు..