
జయ్ న్యూస్, ఆర్మూర్: ఆర్మూర్ పట్టణంలోని రైతు వేదికలో తహసీల్దార్ సత్యనారాయణ ఆధ్వర్యంలో రెవెన్యూ సదస్సు నిర్వహించారు. అనంతరం ఆయన భూభారతిపై రైతులకు అవగాహన కల్పించారు. భూ సమస్యలకు సంబంధించిన దరఖాస్తులను స్వీకరించారు. మార్కెట్ కమిటీ చైర్మన్ సాయిబాబా గౌడ్ మాట్లాడుతూ గత ప్రభుత్వం తీసుకొచ్చిన ధరణి వల్ల రైతులు అనేక రకాలుగా ఇబ్బందులు పడ్డారని, కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలో వచ్చాక రైతులను దృష్టిలో ఉంచుకొని భూ భారతి కొత్త ఆర్ఓఆర్ చట్టం తీసుకొచ్చిందని తెలిపారు. రైతుల సమస్యలు భూభారతి చట్టం ద్వారా పరిష్కారమవుతాయని అన్నారు. భూభారతి చట్టానికి ప్రజల నుంచి విశేషమైన స్పందన వస్తోందని వైస్ ఛైర్మన్ ఇట్టేం జీవన్ అన్నారు. ఈ కార్యక్రమంలో డైరెక్టర్ అమృత్ రావ్, రెవెన్యూ శాఖ అధికారులు, రైతులు పాల్గొన్నారు.