
జయ్ న్యూస్, డొంకేశ్వర్: డొంకేశ్వర్ ముదిరాజ్ మండల కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. డొంకేశ్వర్ మండల కేంద్రంలోని ముదిరాజ్ సంఘం భవనంలో ఆయా గ్రామాలకు చెందిన సభ్యులు సమావేశమై పలు అంశాలపై చర్చించారు. అనంతరం మండల కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. మండల అధ్యక్షునిగా రాజేశ్వర్, ఉపాధ్యక్షుడిగా మద్దులు రాజేందర్, ప్రధాన కార్యదర్శిగా అనిల్, క్యాసియర్ గంగారం రాములు, పెద్ద గొండ మోహన, ఆకుల రాములు, బోజన్న, నడ్పి గంగారం, గంగా కిసాన్, గైండ్ల రాజేశ్వర్, జక్కం కిషన్,సాయికుమార్,లను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఎన్నికైన నూతన కమిటీ సభ్యులను పూలమాలలు వేసి శాలువాతో ఘనంగా సన్మానించారు. అనంతరం వారు మాట్లాడుతూ… ముదిరాజుల ఐక్యత కోసం కలసికట్టుగా పోరాటం చేయాల్సిన అవసరం ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో ముదిరాజ్ కులస్తులు పెద్దగొండ శీను, వేల్పూర్ శ్యామ్, తరుణ్,తదితరులు పాల్గొన్నారు..