
జయ్ న్యూస్, జక్రాన్ పల్లి: జక్రాన్ పల్లి మండలం తొర్లికొండ గ్రామంలోని స్వయంభూ శిలా తీర్థ శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవాలయంలో పౌర్ణమి సందర్భంగా సుప్రభాత సేవ నిర్వహించారు. అలాగే సాయంత్రం ఊంజల్ సేవ నిర్వహించినట్లు అర్చకులు తెలిపారు. స్వామివారు భక్తులకు విశేష అలంకరణలో దర్శనమిచ్చారు. చుట్టుపక్కల ప్రాంతాల భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.