
జయ్ న్యూస్, ఆలూర్: విద్యార్థులు శ్రద్ధగా చదివి పాఠశాలకు మంచి పేరు తీసుకురావాలని ఆలూర్ మండల విద్యాశాఖ అధికారి నరేందర్ ఆకాంక్షించారు. గురువారం ఆలూరు మండలం కల్లడి గ్రామంలోని ఉన్నత పాఠశాల & ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు ఉచిత పాఠ్యపుస్తకాలు, నోట్ పుస్తకాలు, ఏకరూప దుస్తులను పంపిణీ చేశారు. విద్యార్థులకు ప్రభుత్వం కల్పించే సౌకర్యాలను వినియోగించుకోవాలని కోరారు. విద్యార్థులు శిఖరాలకు చేరుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.