
జయ్ న్యూస్, భీమ్ గల్: భీంగల్ మండలం, పురనిపెట్ గ్రామంలో తెలంగాణ ప్రభుత్వం నూతనంగా ప్రవేశపెట్టిన భూభారతి రెవెన్యూ చట్టంపై అవగాహన కల్పించేందుకు ప్రతి గ్రామపంచాయతీ స్థాయిలో రాష్ట్ర వ్యాప్తంగా ప్రత్యేకంగా సదస్సులు నిర్వహించబడుతున్నాయి. గ్రామపంచాయతీ కార్యాలయంలో నిర్వహించిన భూభారతి అవగాహన సదస్సులో రైతులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ యువ నాయకులు “దైడి.సురేష్” మాట్లాడుతూ భూభారతి చట్టం ద్వారా ప్రజల భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం లభించనుందన్నారు. రైతులకు భూస్వాములు ఎలాంటి సమస్యలు లేకుండా తమ హక్కులను రిజిస్టరు చేసుకునే అవకాశం ఈ చట్టం కల్పిస్తోందన్నారు. గ్రామస్థాయిలోనే డిజిటల్ రికార్డులు అందుబాటులో ఉండడం ద్వారా నూతన రెవిన్యూ చట్టం పారదర్శకత నిర్వహించబడుతుందన్నారు. ఈ చట్టాన్ని ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు ఏవైనా సందేహాలు ఉంటే సంబంధిత రెవెన్యూ అధికారులను సంప్రదించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మార్వో షబ్బీర్, రెవెన్యూ అధికారులు కాంగ్రెస్ పార్టీ నాయకులు తోట శివ క్రాంతి, సీరం సాగర్, కైరా. శ్యామ్, తోట గణేష్, బాసిరాబాద్. స్వామి, మల్లెల. జనార్దన్, తోట. శ్రీనివాస్ కార్యకర్తలు, గ్రామాభివృద్ధి కమిటీ, స్థానిక రైతులు మహిళలు తదితరులు పాల్గొన్నారు.