
జయ్ న్యూస్, ఆర్మూర్: ఆర్మూర్ మున్సిపల్ ఆధ్వర్యంలో 100 రోజుల కార్యాచరణ ప్రణాళికలో భాగంగా మున్సిపల్ కార్యాలయంలో వర్షాకాలం దృష్ట్యా సీజనల్ వ్యాధుల నివారణ మార్గాలపై మున్సిపల్ వార్డు ఆఫీసర్లు, మున్సిపల్ శానిటరీ జవాన్లకు గురువారం అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారని ఆర్మూర్ మున్సిపల్ కమిషనర్ రాజు తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా DMO తుకారాం రాథోడ్ హాజరయ్యారు. డెంగ్యూ నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలిపారు. ఫ్రైడే మరియు డ్రైడే రోజుల్లో మున్సిపల్ సిబ్బంది హెల్త్ సిబ్బందితో సర్వేలో పాల్గొనాలని డిప్యూటీ డి ఎం హెచ్ ఓ డాక్టర్ రమేష్ కోరారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ సానిటరీ ఇన్స్పెక్టర్ గజానంద్, వైద్య ఆరోగ్యశాఖ అధికారులు, తదితరులు పాల్గొన్నారు.