
జయ్ న్యూస్, ఆర్మూర్: ప్రభుత్వ పాఠశాలల్లో ఎటువంటి సమస్యలు లేకుండా చూడాలని AIPSU ఆర్మూర్ డివిజన్ కార్యదర్శి గోపాల్ సింగ్ కోరారు. శుక్రవారం ఆర్మూర్ పట్టణంలోని MEO కార్యాలయంలో వినతిపత్రం అందజేశారు. ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల సంఖ్య పెరగడానికి.. పాఠశాలలు ప్రారంభ సమయంలోనే విద్యార్థులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా చూడాలన్నారు. పాఠ్యపుస్తకాలు, యూనిఫాంల పంపిణీ సరైన సమయంలో పూర్తి చేసి విద్యార్థులను చదువుకునేలా ప్రోత్సహించాలన్నారు. అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులు కల్పించాలని డిమాండ్ చేశారు.