
జయ్ న్యూస్, ఆర్మూర్: ఆర్మూర్ పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కో ఎడ్యుకేషన్ కళాశాలలో 2025-2026 విద్యా సం॥నకు గాను ప్రథమ సంవత్సరం లో ప్రవేశాలు జరుగుచున్నవి. కావున కళాశాల అధ్యాపక బృందం అమ్మాపూర్, మగ్గిడి, ఖానాపూర్, పెర్కిట్ గ్రామాలలో ప్రచారం నిర్వహించడం జరిగింది. (బాలుర, బాలికలకు) వేర్వేరుగా ఉచిత హాస్టల్ వసతి కలదని, ఉచిత పాఠ్యపుస్తకాలు, అనుభవజ్ఞులైన అధ్యాపకులచేత నాణ్యమైన విద్యను అందించడం జరుగుతుందని కళాశాల ప్రిన్సిపాల్ విజయానందరెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో బట్టుచంద్రశేఖర్, పోతు నరేష్, రామకృష్ణ, లక్ష్మణ్, శ్రీనివాస్ గౌడ్, కృష్ణ మోహన్, సుమన్, నిఖిత, విజయలక్ష్మి, గంగాధర్, చంద్రమోహన్, సుభాష్ అధ్యాపకులు పాల్గోన్నారు.