
జయ్ న్యూస్, భీమ్ గల్: భీమ్ గల్ మండలం బడా భీంగల్ గ్రామంలో శుక్రవారం 12 నూతన ఇందిరమ్మ గృహాలకు ఎంపీడీవో గంగుల సంతోష్ కుమార్ ముగ్గులు పోసి మార్కింగ్ చేశారు. ఇందిరమ్మ లబ్ధిదారులు 100 శాతం దివ్యాంగురాలు అయిన రాజమణికి ఇందిరమ్మ ఇల్లు మంజూరు పత్రాన్ని ఎంపీడీవో అందజేశారు. అదేవిధంగా గ్రామంలో ఇందిరమ్మ ఇండ్లు నిర్మిస్తున్న ప్రదేశాలను ఎంపీడీవో సందర్శించారు. ఈ కార్యక్రమంలో కార్యదర్శి రజిత, ఇందిరమ్మ కమిటీ సభ్యులు విజయ్ సురేష్ శ్రీనివాస్ తదితరులున్నారు.