
జయ్ న్యూస్, నిజామాబాద్: నిజామాబాద్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జిల్లా నూతన కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డిని నిజామాబాద్ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అంతిరెడ్డి రాజారెడ్డి మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం బదిలీపై వెళ్తున్న కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతుకు వీడ్కోలు పలుకుతూ ఘనంగా సన్మానించారు. బదిలీపై వెళ్తున్న కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు జిల్లాలోని గ్రంథాలయాలలో పాఠకులకు అవసరమైన సౌకర్యాలు కల్పించుటకు నిధులు మంజూరు చేసినందుకు కృతజ్ఞతలు తెలుపుతున్నామన్నారు. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ లైబ్రేరియన్ తారకం, జూనియర్ అసిస్టెంట్ శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.