
జయ్ న్యూస్, జక్రాన్ పల్లి: జక్రాన్ పల్లి మండలం తొర్లికొండ గ్రామంలో గీత పారిశ్రామిక సహకార సంఘం (గౌడ సంఘం) ఆధ్వర్యంలో శ్రీ రేణుక ఎల్లమ్మ నాలుగవ వార్షికోత్సవ వేడుకలు అంగరంగ వైభవం నిర్వహిస్తున్నామని గౌడ సంఘం సభ్యులు తెలిపారు. రేపు ఉదయం 8 గంటలకు ఎల్లమ్మ తల్లికి అభిషేకం, 9 గంటలకు కుంకుమార్చన, 11 గంటలకు యజ్ఞ హోమాలు, అన్నదాన, కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని గౌడ సంఘం సభ్యులు తెలిపారు. మంగళవారం ఎల్లమ్మ తల్లి యొక్క కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమాలకు గ్రామ ప్రజలు భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చి అమ్మవారి వార్షికోత్సవ వేడుకలను విజయవంతం చేయాలని గౌడ సంఘం సభ్యులకు కోరారు.