
జయ్ న్యూస్, ఆర్మూర్: నిజామాబాద్ జిల్లా ఇంచార్జి మంత్రి సీతక్కను ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి తెలంగాణ సచివాలయంలో మంగళవారం నాడు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మంత్రిని శాలువాతో సన్మానించారు. నియోజకవర్గంలో పలు సమస్యలను మంత్రి దృష్టికి తీసుకువెళ్లడం జరిగిందని వాటిని పరిష్కరించాలని కోరడంతో, మంత్రి సానుకూలంగా స్పందించారని అలాగే గ్రామీణ ప్రాంతాల్లో రోడ్లు, పాఠశాలలు పునర్నిర్మాణం చేయాలని అతి త్వరలో జిల్లాలోని ఆర్మూర్ నియోజకవర్గంలో పర్యటనా చేయాలని మంత్రి సీతక్కను కోరినట్లు ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి పేర్కొన్నారు.