
జయ్ న్యూస్, నిజామాబాద్: మంగళవారం నిజామాబాద్ నగరంలోని పోలీస్ కమిషనర్ క్యాంప్ కార్యాలయానికి వృద్ధురాలు తన గోడు వినిపించుకోవడానికి పోలీస్ క్యాంప్ కార్యాలయానికి రావడం జరిగింది. సాయంత్రం సమయంలో అప్పుడే అటువైపు నుంచి క్యాంపు కార్యాలయానికి వస్తున్న నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి సాయి చైతన్య, ఐపీఎస్. అట్టి వృద్ధిరాలిని చూసి తన కారులో నుంచి దిగి త్వరితగతిన ఆ వృద్ధ ఫిర్యాదుదారురాలు వద్దకు వెళ్లి అట్టి ఫిర్యాదును తీసుకొని ఆమె సమస్యను క్షుణ్ణంగా వినడం జరిగింది. ఆ వృద్ధురాలు ఆర్మూర్ ప్రాంతానికి చెందిన వృద్ధురాలిగా తెలిపినది. ఆమెపై పాత కక్షలు దృష్టిలో పెట్టుకొని తమ సమీప బంధువులు దాడి చేశారని తెలియజేసింది. ఈ వృద్ధురాలి సమస్యని త్వరితగతిన పరిష్కరించాలని ఆర్మూర్ SHO కు ఆదేశాలు జారీ చేయడం జరిగింది.