
జయ్ న్యూస్, నిజామాబాద్: మంగళవారం నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి.సాయి చైతన్య, ఐ.పి.యస్ రెంజల్ పోలీస్ స్టేషన్ ను తనిఖీ చేశారు. ఈ సందర్బంగా పోలీస్ కమిషనర్ పోలీస్ స్టేషన్ మొత్తం కలియ తిరిగి పోలీస్ స్టేషన్ పనితీరును క్షుణ్ణంగా పరిశీలించారు. రిసిప్షన్ సెంటర్ పనితీరును, కంప్యూటర్ సిబ్బంది పనితీరును క్షుణ్ణంగా అడిగి తెలుసుకున్నారు. 5S విధానం అమలు చేస్తున్నారా లేదా అడిగి తెలుసుకొని మొత్తం చూసారు. వాహనాల పార్కింగ్ చూసారు. రోడ్డు ప్రమాదాల నివారణకు తీసుకోవల్సిన జాగ్రత్తలు తెలియజేశారు. ప్రధానంగా ఎక్కువ ప్రమాదాలు ద్విచక్ర వాహనాదారులకు జరుగుతున్నందున, తప్పనిసరి హెల్మేట్ ధరించి ప్రయాణం చేయాలని సూచించారు. గంజాయి నిర్మూలనకు అధికారులకు ఆదేశాలు జారీచేయడం జరిగిందని, ఎవరయిన గంజాయికి బానిస అవుతే వారికి కౌన్సిలింగ్ చేయాలని తెలిపారు. దాని నిర్మూలనకు పటిష్టమైన నిఘా ఏర్పాటు చేయడం జరిగిందని తెలియజేశారు. సైబర్ మోసగాండ్ల నుండి ప్రజలు మోసపోకుండా ప్రజలను అప్రమత్తం చేయాలని సూచించారు. గెమింగ్ అప్ ల పట్ల ప్రజలు మోసపోకుండా ఎప్పటికప్పుడు వారికీ అవగాహనా కార్యక్రమాలు నిర్వహిoచాలని అన్నారు. అనంతరం సిబ్బంది సాధక బాధలు ప్రతీ ఒక్కరిని అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో బోధన్ ACP పి. శ్రీనివాస్, బోధన్ రూరల్ ఇన్స్పెక్టర్ డి. విజయ్ బాబు, రెంజల్ SI కె. చంద్ర మోహన్ మరియు పోలీస్ స్టేషన్ సిబ్బంది పాల్గొన్నారు.