
జయ్ న్యూస్, జక్రాన్ పల్లి: తొర్లికొండ గ్రామంలోని శ్రీ రేణుక ఎల్లమ్మ దేవాలయం నాల్గవ వార్షికోత్సవం వేడుకలలో భాగంగా అమ్మవారికి మహిళలు మంగళవారం బోనాలను సమర్పించారు. శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించారు. అమ్మవారికి ప్రత్యేకమైన నైవేద్యాలు సమర్పించారు. అనంతరం నాగవెల్లి, అన్నదానం జరిగింది. అమ్మవారి దయతో అందరూ బాగుండాలని కోరుకున్నామన్నారు. గీత కార్మిక సహకార సంఘం (గౌడ సంఘం) అధ్యక్షుడు నాగపురం శ్రీనివాస్ గౌడ్, ఉపాధ్యక్షుడు చరణ్ గౌడ్, సెక్రటరీ మధుసూదన్ గౌడ్, కోశాధికారి ఎం శ్రీనివాస్ గౌడ్, డైరెక్టర్లు ఉత్కం శ్రీనివాస్ గౌడ్, బోజ్జ సంజీవ్ గౌడ్, రత్నగిరి శేఖర్ గౌడ్, మహర్షి గౌడ్, జీవన్ గౌడ్, మోహన్ గౌడ్, ఎల్లారి గౌడ్, వంశీ గౌడ్, రాజేష్ గౌడ్, బొజ్జ శీను, బూడిద రాజేశ్వర్ గౌడ్, ఆలయ అర్చకుడు పూదారి యోగానంద స్వామి గౌడ్, గౌడ సంఘం సభ్యులు, మహిళలు, భక్తులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.