
జయ్ న్యూస్, భీమ్ గల్: భీమ్ గల్ మండలం చెంగల్ గ్రామంలో ‘బైపాస్ బీటీ రోడ్ పనులు’ బుధవారం ప్రారంభించారు. ఈ రోడ్డు “చెంగల్ గ్రామ ప్రజల ఇరవై సంవత్సరాల కల” కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం ఈ రోడ్డు నిర్మించడం ద్వారా చెంగల్ గ్రామ ప్రజల కల నెరవేరిందని గ్రామ ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ బైపాస్ రోడ్ నిర్మాణానికి ఎంతో కృషిచేసి మంత్రులతో అధికారులతో మాట్లాడి ఈ రోడ్డును శాంక్షన్ చేయించిన కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జ్ “ముత్యాల సునీల్ కుమార్” కి చెంగల్ గ్రామ ప్రజలు ఎల్లపుడు రుణపడి ఉంటామని ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు మార్కెట్ కమిటీ డైరెక్టర్ నరసాపురం.జీవన్, కాంగ్రెస్ పార్టీ మండల ట్రెజరర్ దుమల.రాజు, గ్రామ శాఖ అధ్యక్షుడు నూతుల.రమేష్, యూత్ ప్రెసిడెంట్ ఆర్మూర్ రవి, సీనియర్ నాయకులు వసంత్ రెడ్డి, అడపా రాజేశ్వర్, గ్రామ ప్రజలు, తదితరులు పాల్గొన్నారు.