
జయ్ న్యూస్, నిజామాబాద్: నిజామాబాద్ జిల్లా కేంద్రంలో ప్రభుత్వం నూతనంగా నిర్మించిన మాత శిశు ప్రభుత్వ ఆసుపత్రి భవనం సంవత్సర క్రితం ప్రారంభం పూర్తయినప్పటికీ నేటికీ ప్రజలకు అందుబాటులోకి రాకపోవడం వలన గ్రామీణ, పట్టణ ప్రాంత పేద మహిళ గర్భిణీలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి రమేష్ బాబు అన్నారు. తక్షణమే జిల్లా కలెక్టర్ జోక్యం చేసుకొని మాతా శిశు ఆరోగ్య కేంద్రాన్ని నూతన భవనంలోకి మార్చాలని సిపిఎం పార్టీ నిజామాబాద్ జిల్లా కమిటీ డిమాండ్ చేస్తుందని అన్నారు. పాత భవనంలోనే కొనసాగించటం వలన సౌకర్యాలు లేక ప్రసవాలకు వచ్చే పేద గర్భిణీ మహిళలు అని వార్యంగా ప్రవేట్ కార్పోరేట్ ఆసుపత్రిలకు వెళ్లి ఆర్థికంగా అనేక ఇబ్బందులకు గురవుతున్నారు. కోట్లాది రూపాయల ప్రజా ధనంతో నిర్మించిన ప్రభుత్వ భవనం నిరుపయోగంగా పడి ఉందని సిపిఎం జిల్లా కార్యదర్శి రమేష్ బాబు విమర్శించారు.