
జయ్ న్యూస్, ధర్పల్లి: ధర్పల్లి మండల కేంద్రంలోని మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో వైద్య, ఐసిడిఎస్, ఐకెపి, ఈజీఎస్, రెవెన్యూ, పంచాయతీ కార్యదర్శులతో కలిసి సీజనల్ వ్యాధులు, ఇందిరమ్మ ఇండ్లు తదితర అంశాలపై సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో డిప్యూటీ డిఎంహెచ్వో మరియు జిల్లా మలేరియా అధికారి డాక్టర్ రాథోడ్ మాట్లాడుతూ డెంగ్యూ, మలేరియా వ్యాధుల పట్ల ప్రజలు అవగాహన కలిగి అప్రమత్తంగా ఉండాలన్నారు. దోమలు కుట్టకుండా దోమతెరలు వాడనున్నారు. సీజనల్ వ్యాధులను నియంత్రణకు తీసుకోవాల్సిన చర్యలు, ఇందిరమ్మ ఇండ్ల ప్రగతి, వన మహోత్సవ కార్యక్రమాలపై సమగ్రంగా చర్చించారు. ఈ కార్యక్రమంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం సిరికొండ వైద్య అధికారి డాక్టర్ అరవింద్, కమ్యూనిటీ హెల్త్ సెంటర్ ధర్పల్లి వైద్య అధికారి డాక్టర్ మౌనిక, మిషన్ భగీరథ ఇన్ ట్రా డిప్యూటీ ఈఈ ధర్మేందర్, ఎంపీడీవో బాలకృష్ణ, తహసీల్దార్ శాంత, ఎంపీఓ రాజేష్, పంచాయతీ రాజ్ అసిస్టెంట్ ఇంజనీర్ బాలాజీ, హౌసింగ్ అసిస్టెంట్ ఇంజనీర్ అనూష, ఐసిడిఎస్ సూపర్వైజర్లు బుజ్జి, సరిత, ఏపీవో వినోదా, ఏపీఎం సునీత, ఈసీ సంజీవ్, పంచాయతీ కార్యదర్శులు, టెక్నికల్ అసిస్టెంట్లు, ఫీల్డ్ అసిస్టెంట్లు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.