
జయ్ న్యూస్, ఇందల్వాయి: ఇందల్వాయి పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న గన్నారం గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పలు అంశాలపై పోలీసులు అవగాహన కల్పించారు. రోడ్డు భద్రత అవగాహన, ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని సూచించారు.. ఆటోలో పరిమితికి మించి ప్రయాణికులను ఎక్కించుకోవద్దని వాహనదారులు తప్పనిసరిగా రోడ్డు నిబంధనలు పాటించాలన్నారు. మహిళల రక్షణ కోసం షీ టీం కృషి చేస్తుందని, మహిళలు ఆపదలో ఉన్నప్పుడు డయల్ 100 కు కాల్ చేయాలని సూచించారు. అదేవిధంగా సైబర్ మోసాల నుండి రక్షణ కోసం అప్రమత్తంగా ఉండాలని, సైబర్ మోసాలకు గురైతే టోల్ ఫ్రీ నెంబర్ 1930 కు ఫోన్ చేయాలన్నారు. యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని సూచించారు. సమాజంలో జరుగుతున్న నేరాలు చట్టాలపై అవగాహన కలిగి ఉండాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎస్సై సందీప్, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.