
జయ్ న్యూస్, రెంజల్: నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి.సాయి చైతన్య, ఐ.పి.యస్, రెంజల్ పోలీస్ స్టేషన్ పరిధిలో కందకుర్తి వద్ద గల త్రివేణి సంగమం నది పరివాహక ప్రదేశాలను, భద్రత ఏర్పాట్లను పర్యవేక్షించారు. వర్షా కాలంలో భారీ స్థాయిలో వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో నిజామాబాద్, ఆర్మూర్, బోధన్ డివిజన్ పరిధిలోని నీటి పరివాహక ప్రాంతాల్లో మరియు నదులు, కాలువల ప్రాంతాలలో ప్రజలు వారి యొక్క మ్రొక్కులు తీర్చుకోవడానికి , మరియు స్నానాలు చేయడానికి వస్తుంటారు… కావున, ప్రజల భద్రత నేపథ్యంలో అట్టి స్థలాలలో గట్టి భద్రతా ఏర్పాట్లు చేయాలని ACP లకు, CI లకు, SHO లకు, SI లకు ఆదేశాలు జారిచేయడం జరిగిందని ఆయన పేర్కొన్నారు. కందకుర్తీ వద్ద గల త్రివేణి సంగమం ఘాటుకు తెలంగాణ, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాల నుండి ప్రజలు చాలా మంది వస్తూ ఉంటారు. త్రివేణి సంగమం నదిలో స్నానం చేయడానికి అని నీటి లోనికి, లోపలికి వెళుతూ ఉంటారు. వారు అనుకోకుండా నది లోపలికి వెళ్ళిపోయిన అనంతరం వారికి ఈత రాకపోవడం వలన నదిలో మునిగి పోయే అవకాశం ఉంది. కావున ఇట్టి నది పరివాహ ప్రాంతాన్ని క్షుణ్ణంగా పరిశీలించిన పోలీస్ కమిషనర్ పి.సాయి చైతన్య, ఐ.పీ.ఎస్, రెంజల్ పోలీస్ స్టేషన్ ఎస్.హెచ్.ఓ కు ఇట్టి త్రివేణి సంగమం వద్ద గజ ఈతగాలను అందుబాటులో ఉంచాలని, ఘాట్ల వద్ద ప్రమాదాలు నివారణకు భారికేడ్లు, ప్రమాద గటికలను గుర్తించి ఆ ప్రాంతంలో అటు వైపు ఇటు వైపు త్రాడుతో కట్టి వేయాలని, అట్టి త్రాడు దాటి ఎవరు ముందుకు వెళ్ళారాదని తెలిపే విధంగా ఏర్పాట్లు చేయాలనీ, ప్రమాద గటికల చిహ్నంలు ఫ్లెక్సీ రూపంలో తయారు చేసి ఉంచాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో బోధన్ ACP పి. శ్రీనివాస్, బోధన్ రూరల్ ఇన్స్పెక్టర్ డి. విజయ్ బాబు, రెంజల్ SI కె. చంద్ర మోహన్ తదితరులున్నారు.