
జయ్ న్యూస్, ఆర్మూర్: ఆర్మూర్ నియోజకవర్గంలోని ఆర్మూర్ మండలం మంథని గ్రామానికి చెందిన బూస మల్లయ్య ఇటీవలే అనారోగ్యంతో బాధపడుతూ సర్జరీ కోసం NIMS హాస్పిటల్ లో జాయిన్ అయ్యారు…. కాంగ్రెస్ నాయకులు ఆర్మూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ప్రొద్దుటూరి వినయ్ కుమార్ రెడ్డికి విన్నవించడంతో వారు స్పందించి ముఖ్యమంత్రి సహాయ నిధి LOC ద్వారా 2,00,000 రెండు లక్షల రూపాయల LOC కాపీని స్వయానా బాధిత కుటుంబ సభ్యులకు హైదరాబాద్ లోని జూబ్లీ హిల్స్ ఆఫీస్ లో వినయ్ రెడ్డి అందజేశారు. LOC కాపీ ఇప్పించిన ప్రొద్దుటూరి వినయ్ కుమార్ రెడ్డికి బాధితులు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.