
జయ్ న్యూస్, ఆర్మూర్: ఆర్మూర్ పట్టణంలోని శ్రీ భాషిత పాఠశాలలో 30 రోజులలో తెలుగు అనార్గళంగా చదవడం రాయడంపై ప్రత్యేక శిక్షణ తరగతులు నిర్వహించారు. ఈ శిక్షణ కార్యక్రమంలో మూడవ తరగతి నుండి పదవ తరగతి విద్యార్థులకు నాలుగు రోజులపాటు ఈ శిక్షణను ఏర్పాటు చేశారు. ఈ శిక్షణ శిబిరం ప్రముఖ చదువుల డాక్టర్ సంగ రాజు భాస్కర్ రాజు లచే శిక్షణ తరగతులు ఏర్పాటు చేశారు.
ఈ శిక్షణలో భాగంగా విద్యార్థులకు తెలుగు అక్షరాల పరిచయం నుండి ప్రారంభించి, పదాల నిర్మాణం, వాక్య నిర్మాణం, పఠన నైపుణ్యం, మంచి చేతి వ్రాత వంటి అంశాలపై దశలవారీగా వివరణ ఇస్తూ విద్యార్థుల చేత పలికించడం రాయించడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాఠశాల కరస్పాండెంట్ పోలపల్లి సుందర్ పాల్గొని మాట్లాడుతూ తెలుగు భాషను ప్రాముఖ్యంగా తీసుకొని పిల్లలకు పఠన, లేఖన నైపుణ్యాలు నేర్పించడం ద్వారా వారి భవిష్యత్తులో భాష పట్ల గౌరవం పెరిగేలా చేయాలన్నదే మా లక్ష్యం అని పేర్కొన్నారు. అంతేకాకుండా విద్యార్థులకు తెలుగు సబ్జెక్ట్ అంటే భయం కలుగుతుంది.. ఆ భయాన్ని పోగొట్టడానికి విద్యార్థుల కోసం 30 రోజులలో తెలుగులో అనర్గళంగా చదవడం రాయడం పై ప్రత్యేక కార్యశాలను ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపల్, ఉపాధ్యాయుని, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.