
జయ్ న్యూస్, ఆర్మూర్: తెలంగాణ రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ ను ఆర్మూర్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ వినయ్ రెడ్డి ఆదివారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఆర్మూర్ నియోజకవర్గ అభివృద్ధికి నిధులు కేటాయించాలని వినయ్ రెడ్డి మంత్రికి విజ్ఞప్తి చేశారు. అనంతరం వినయ్ రెడ్డి మంత్రితో పలు అంశాలపై చర్చించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని వర్గాల సంక్షేమానికి పాటుపడుతుందని మంత్రి చెప్పుకొచ్చారు.