
జయ్ న్యూస్, బాల్కొండ: హైదరాబాదులో బాల్కొండ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి ముత్యాల సునీల్ కుమార్ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఆదివారం మర్యాదపూర్వకంగా కలిశారు. బాల్కొండ నియోజకవర్గంలో అత్యవసరంగా చేపట్టబోయే వివిధ అభివృద్ధి పనులను సునీల్ రెడ్డి సీఎం రేవంత్ రెడ్డి ముందు ప్రస్తావించారు. అలాగే పెండింగ్ లో ఉన్న పనులను పూర్తి చేయించవలసిందిగా ఆయన ముఖ్యమంత్రిని కోరారు.
సానుకూలంగా స్పందించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బాల్కొండ నియోజకవర్గ అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని తెలిపారు.