
జయ్ న్యూస్, నిజామాబాద్: సోమవారం పోలీస్ కమిషనర్ కార్యాలయానికి మహిళా ఫిర్యాదుదారులు తన గోడు వినిపించుకోవడానికి పోలీస్ కార్యాలయానికి రావడం జరిగింది. ఉదయం సమయంలో అప్పుడే అటువైపు నుంచి పోలీస్ కార్యాలయానికి వస్తున్న నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి. సాయి చైతన్య, ఐ.పీ.ఎస్., అట్టి మహిళా ఫిర్యాదురాలిని చూసి తన కారులో నుంచి దిగి త్వరితగతిన అట్టి మహిళా ఫిర్యాదుదారురాలు వద్దకు వెళ్లి అట్టి ఫిర్యాదును తీసుకొని ఆమె సమస్యను క్షుణ్ణంగా వినడం జరిగింది. ఆ మహిళ ఫిర్యాది పేరు భామని సవిత , టౌన్ – 2 పోలీస్ స్టేషన్ ప్రాంతానికి చెందిన తెలిపినది. తన భర్త వేధింపులు, అదనపు కట్నం కోసం భర్త వేధిస్తున్నాడు అని తెలియజేయడం జరిగింది. ఈ మహిళ ఫిర్యాదిరాలి సమస్యని త్వరితగతిన పరిష్కరించాలని మహిళా పోలీస్ స్టేషన్ SHO కు ఆదేశాలు జారీ చేయడం జరిగింది.