
జయ్ న్యూస్, డొంకేశ్వర్: ఆర్మూర్ నియోజకవర్గంలోని డొంకేశ్వర మండలం తొండకూరు గ్రామానికి చెందిన షేక్ అబ్బాస్ అనారోగ్యంతో బాధపడుతూ NIMS హాస్పిటల్ లో సర్జరీ చేయించుకున్నారు….కాంగ్రెస్ నాయకులు ఆర్మూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ప్రొద్దుటూరి వినయ్ కుమార్ రెడ్డికి విన్నవించడంతో వారు స్పందించి వారి ఆదేశాలతో ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి 60 వేల రూపాయల సీఎంఆర్ఎఫ్ చెక్కును బాధిత కుటుంబ సభ్యులకు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు భూమేష్ రెడ్డి అందజేశారు. సీఎంఆర్ఎఫ్ చెక్కు ఇప్పించిన వినయ్ కుమార్ రెడ్డికి బాధితులు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు