
జయ్ న్యూస్, సిరికొండ: నిజామాబాద్ జిల్లా సిరికొండ మండలం తాళ్ల రామడుగులోని శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయంలో ప్రతి శనివారం అన్నసత్రం నిర్వహించడం జరుగుతుంది. ఈ సందర్భంలో ప్రతి వారం టెంట్ అవసరం ఉన్న విషయాన్ని గుర్తించిన శ్రీ కోటగిరి గంగ నారాయణ రూ.10,000 విలువైన టెంట్ను ఆలయ కమిటీకి ఈరోజు అందజేశారు.ఈ సందర్భంగా ఆలయ శాశ్వత చైర్మన్ బచ్చు పురుషోత్తం గుప్తా కమిటీ తరపున ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ అధ్యక్షులు బాకారం రవి, ప్రధాన కార్యదర్శి కుందేళ్ల శ్రీనివాస్, కోశాధికారి నక్క రాజేందర్, సలహాదారులు కర్క భూపాల్, పల్లికొండ లింబాద్రి, పెండ్లి రాజేశ్వర్, చింతపండు ఆంజనేయులు, బాకారం చిన్న గంగారెడ్డి తదితరులు పాల్గొన్నారు.