
జయ్ న్యూస్, ఆర్మూర్: ఆర్మూర్ సీఐ సత్యనారాయణ తన సిబ్బందితో కలిసి పెర్కిట్ (NH 44) హైవే బ్రిడ్జిపై సిబ్బందితో కలిసి పర్యవేక్షిస్తున్నారు. హైదరాబాద్ వైపు వెళ్లేవారు , మెట్పల్లి, కోరుట్ల, కరీంనగర్ మీదుగా హైదరాబాద్ వెళ్లాలని సూచించారు. కామారెడ్డిలో భారీ వర్షాలకు హైవే దెబ్బ తినడం వల్ల దారి మళ్లింపు జరుగుతుందన్నారు. ఈ విషయాన్ని వాహనదారులు గమనించాలని సీఐ సత్యనారాయణ సూచించారు.