జయ్ న్యూస్, నిజామాబాద్: వర్షాకాలంలో మరియు చలికాలంలో విధుల నిర్వహణ కష్టమవుతున్నదన్న ముందు జాగ్రత్తలో భాగంగా నేడు నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి.సాయి చైతన్య, ఐ.పీ.ఎస్ నిజామాబాదులోని 362 మంది హోంగార్డ్స్ కు రేయిన్ కోర్ట్స్ ప్రధానం చేయడం జరిగింది. ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ వర్షాకాలంలో మరియు చలికాలం సమీపిస్తున్న సందర్భంగా ప్రతి ఒక్కరు ఈ రేయిన్ కోర్ట్స్ ను సద్వినియోగం చేసుకోవాలని, విధి నిర్వహణలో కూడా క్యారీ చేసి అవసరనిమిత్తం ఉపయోగించుకోవాలని తెలియజేశారు. ఈ సందర్భంగా అడిషనల్ డీ.సీ.పీ(ఏ.ఆర్) రామచంద్ర రావు , హోంగార్డ్స్ విభాగం రిజర్వ్ ఇన్స్పెక్టర్ సతీష్ మరియు హోమ్ గార్డ్స్ సిబ్బంది తదితరులున్నారు.
