జయ్ న్యూస్, నిజామాబాద్: నిజామాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో నిజామాబాద్ డిసిసి పదవి కోసం ఆర్మూర్ కాంగ్రెస్ సీనియర్ నాయకులు అయ్యప్ప శ్రీనివాస్ దరఖాస్తు చేసుకున్నారు. పార్టీ సంస్థాగత నిర్మాణ పటిష్టత కోసం నిజామాబాద్ జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుని ఎంపిక ప్రక్రియ మొదలైన విషయం తెలిసిందే… జిల్లా పరిశీలకుడిగా కర్ణాటకకు చెందిన ఎమ్మెల్యే రిజ్వన్ ను కాంగ్రెస్ అధిష్టానం నియమించింది. ఈ కార్యక్రమంలో జంబి హనుమాన్ ఆలయ చైర్మన్ రేగుల్ల సత్యనారాయణ తదితరులు ఉన్నారు.
