జయ్ న్యూస్, జక్రాన్ పల్లి: జాతీయస్థాయి SGF అండర్ 17 వాలీబాల్ పోటీలకు జక్రాన్ పల్లి మండలం కలిగోట్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థిని R ప్రణతి ఎంపికైనట్లు ప్రధానోపాధ్యాయులు పురుషోత్తమాచారి, వ్యాయామ ఉపాధ్యాయుడు యాదగిరి తెలిపారు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో బరేలిలో ఈ నెల 11 తేదీ నుంచి 15 తేదీ వరకు జరిగే పోటీలలో పాల్గొంటారని తెలిపారు. ఈ పోటీలకు ఎంపికైన విద్యార్థినిని అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ చైర్మన్, గ్రామ అభివృద్ధి కమిటీ సభ్యులు, మరియు ఉపాధ్యాయ బృందం అభినందించారు.
