జయ్ న్యూస్, ఆలూర్: ఆలూరు మండల కేంద్రంలో మాల మహానాడు మండల అధ్యక్షుడు అగ్గు క్రాంతి ఆధ్వర్యంలో మాలల రణభేరి మహాసభ పోస్టర్లను, కరపత్రాలను ఆదివారం విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈనెల 23వ తేదీన హైదరాబాద్ నగరంలో జరగనున్న మాలల రణభేరి మహాసభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమం ద్వారా మాల సమాజ హక్కులు, అభివృద్ధి కోసం ప్రతి కుటుంబం సభకు తరలిరావాలని కోరారు.
