జయ్ న్యూస్, ఆలూర్: రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించుకొని అన్ని గ్రామాల్లో కాంగ్రెస్ జెండా ఎగురవేయాలని TPCC చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. హైదరాబాదులోని ఎమ్మెల్యే క్వార్టర్స్ లో రాష్ట్ర ఎస్సీ సెల్ కన్వీనర్ దేగాం ప్రమోద్, నాయకులతో ఆయన భేటీ అయ్యారు. రాష్ట్రంలో ప్రభుత్వం చేసిన అభివృద్ధిని ప్రజలకు వివరించి చెప్పాలన్నారు. యువజన కాంగ్రెస్ మండల అధ్యక్షులు తలారి రాకేష్ తదితరులు ఉన్నారు.
