
ఆలూర్ మండలానికి చెందిన కల్లెడి గ్రామంలో బుధవారం నాడు నూతన బస్టాండ్ నిర్మాణానికి భూమి పూజ కార్యక్రమం జరగింది. ఈ సందర్భంగా DCC సెక్రటరీ డేగ పోశెట్టి మాట్లాడుతూ, ఆర్మూర్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇంచార్జ్ వినయ్ కుమార్ రెడ్డి ఆదేశాల మేరకు ఈ బస్టాండ్ నిర్మాణం ప్రారంభమవుతుందని తెలిపారు. ఈ బస్టాండ్ గ్రామ ప్రజలకు ఎంతో ఉపయోగంగా ఉంటుందని అన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ కాంగ్రెస్ శాఖ అధ్యక్షుడు నిలగిరి శ్రీనివాస్, ఉపాధ్యక్షుడు నర్సిరెడ్డి, సెక్రటరీ అభిబ్, గ్రామ కమిటీ సభ్యులు ఎడ్ల పోశెట్టి, బర్నబాస్, శ్రీరాం కృష్ణ, జంగిట్టి శ్రీనివాస్, యవన్, ఐలి గంగారం, నిలగిరి భాస్కర్, ఉమ్మడి వెంకటేష్, కొండ్రా బొర్రన్న, యూత్ కాంగ్రెస్ తరఫున ఆర్మూర్ నియోజకవర్గ యువజన కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ మరియు మాక్లూర్ యువత కాంగ్రెస్ సెక్రటరీ కొండ్రా శివకృష్ణ, ఆలూర్ మండల యువత కాంగ్రెస్ అధ్యక్షుడు సిరికొండ మహేష్ తదితరులు హాజరయ్యారు.