
భాగ్యరెడ్డి వర్మ గొప్ప సంఘసంస్కర్త అని, అణగారిన వర్గాల అభ్యున్నతికి పాటుపడిన మహనీయుడని మున్సిపల్ కమిషనర్ రాజు అన్నారు. గురువారం ఆర్మూర్ పట్టణంలోని మున్సిపల్ కార్యాలయంలో భాగ్యరెడ్డి వర్మ జయంతి ఉత్సవాల్లో పాల్గొని ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ భాగ్యరెడ్డి వర్మ సామాజిక సమానత్వం, అణగారిన వర్గాల శ్రేయస్సు కోసం జీవితాంతం పోరాడిన మహోన్నత వ్యక్తి అని కొనియాడారు. ఆయన సేవలు, సిద్ధాంతాలు నేటికీ సమాజానికి మార్గదర్శకంగా నిలుస్తున్నాయన్నారు. ప్రతి ఒక్కరూ భాగ్యరెడ్డి వర్మ ఆశయాలను కొనసాగించేలా పనిచేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ మేనేజర్ హయ్యూమ్, సానిటరీ ఇన్స్పెక్టర్ గజానంద్, మాజీ కౌన్సిలర్ రింగుల భూషణ్, మున్సిపల్ అధికారులు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.