
తడిచిన దాన్యం పట్ల రైతులు ఎలాంటి ఆందోళన చెందవద్దని AMC చైర్మన్ సాయిబాబా గౌడ్, వైస్ చైర్మన్ విట్టం జీవన్ అన్నారు. గురువారం ఆర్మూర్ పట్టణంలోని వ్యవసాయ మార్కెట్ కమిటీ ఆధ్వర్యంలో వారు మీడియాతో మాట్లాడారు. తడిచిన ధాన్యాన్ని ప్రభుత్వం 100% కొనుగోలు చేస్తుందని స్పష్టం చేశారు. దీనిని ప్రతిపక్షాలు రాద్ధాంతం చేయడం సరికాదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల ప్రభుత్వం అని రైతులకు అన్యాయం జరగకుండా కాంగ్రెస్ పార్టీ అండగ నిలుస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో AMC డైరెక్టర్లు అమృత్ రావు, కాంగ్రెస్ నాయకుడు ఏలేటి రవికాంత్ రెడ్డి పాల్గొన్నారు.