
ఆర్మూర్ మండలంలోని అందాపూర్ గ్రామంలో ఇందిరమ్మ ఇండ్ల మార్కింగ్ కార్యక్రమంలో ఆర్మూర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, మున్సిపల్ మాజీ ఫ్లోర్ లీడర్ సడక్ వినోద్ కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సడక్ వినోద్ మాట్లాడుతూ కాంగ్రెస్ సర్కార్ పేదలకు ఇచ్చిన మాటను నెరవేర్చడంలో ముందు వరుసలో ఉంటుందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంతోనే నిరుపేదలు సంతోషంగా ఉంటారన్నారు. కాంగ్రెస్ రాష్ట్ర ప్రభుత్వం పేదల ప్రభుత్వమని అన్నారు.