
జయ్ న్యూస్: RC REDDY సిరికొండ, ప్రతినిధి ( మే 25 ): సిరికొండ మండలం న్యావనంది గ్రామంలో క్రింద ఆడకట్టు మున్నూరు కాపు, హరిజనవాడ కుల సంఘాలు ఆదివారం పోచమ్మ పండుగ ఘనంగా నిర్వహించారు. గ్రామంలోని మర్రి చెట్టు కింద కొలువై ఉన్న పోచమ్మకు, నల్ల పోచమ్మ , కట్ట పోచమ్మ, మత్తడి పోచమ్మ, అలుగు పోచమ్మకు కుటుంబ సమేతంగా బోనాలు తీసి, కుల సంఘాల సభ్యులు అందరు మొక్కులు చెల్లించారు. ఇంటిల్లిపాది అందరూ ఆ తల్లి కృపతో బాగుండాలని, దేవి మాత పోచమ్మలకు మొక్కులు చెల్లించుకున్నారు.ప్రతి సంవత్సరం ఆ తల్లి యొక్క దీవెనతో మేమందరం సంతోషంగా ఈ ఊరపోచమ్మ పండగ ఘనంగా నిర్వహిస్తామని కుల సంఘం సభ్యులు ప్రజా శంఖారావం పాత్రికేయునికి తెలిపారు.ఈ కార్యక్రమంలో డాక్టర్ మధుకర్,మున్నూరు కాపు నిజామాబాద్ రూరల్ కోఆర్డినేటర్ మహిపాల్, కాంగ్రెస్ జిల్లా నాయకులు నరేష్, ఏ ఎం సి డైరెక్టర్ రిక్క ముత్తన్న, మున్నూరుకాపు సంఘం అధ్యక్షులు ముష్కిల్ నరేందర్ బెజ్జారం రవి , పుల్లారి నాగేంద్ర, మామిడి కింది వెంకట్ రాజ్, శ్రీకాంత్, పురుషోత్తం, నరసయ్య,జంగం సుదర్శన్ తదితరులు పాల్గొన్నారు.