
జయ్ న్యూస్, ఆర్మూర్: మున్సిపల్ పరిధి కోటామ్మార్ ప్రాంతానికి చెందిన జనార్దన్ గౌడ్ పాడి రైతుకు చెందిన నాలుగు పాడి గేదెలు కరెంట్ తీగలకు తగిలి మృత్యువాత పడ్డాయి. సంఘటన స్థలాన్ని జిల్లా పశు వైద్య మరియు పశుసంవర్ధక శాఖ అధికారి డాక్టర్ రోహిత్ రెడ్డి, మండల పశు వైద్యాధికారి డాక్టర్ లక్కం ప్రభాకర్, ఐదవ వార్డు తాజా మాజీ కౌన్సిలర్ బండారి శాల ప్రసాద్ లు పరిశీలించారు. సుమారు రెండు లక్షల వరకు నష్టం వాటిల్లిందని రైతు ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు.