
జయ్ న్యూస్, సిరికొండ: నిజామాబాద్ రూరల్ కాంగ్రెస్ కోఆర్డినేటర్ జరుపుల గోవింద్ నాయక్, కాంగ్రెస్ పార్టీ వైస్ ప్రెసిడెంట్ రాము మొట్టల, యువజన కాంగ్రెస్ ఎస్.టి. నాయకులు భూపతి నాయక్ ,భాస్కర్ రెడ్డి సిరికొండ పోలీస్ స్టేషన్కి వెళ్లి అక్కడి ఎస్ఐ ఎల్. రామును మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఎస్ఐ కి శుభాకాంక్షలు తెలిపారు. సమాజంలో శాంతి భద్రతలు, పోలీస్ వ్యవస్థపట్ల ప్రజల నమ్మకం పెరగాలన్నదే తమ లక్ష్యమని నేతలు తెలిపారు. ప్రజలకు సైబర్ నేరాల పై, ఆన్లైన్ మోసాలపై అవగాహన కల్పించాలని, యువత చెడు మార్గంలో వెళ్లకుండా వారిపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. కాంగ్రెస్ పార్టీ ప్రజల అభ్యున్నతికి కట్టుబడి పనిచేస్తుందనీ, స్థానిక సమస్యల పరిష్కారానికి అధికారులు, ప్రజాప్రతినిధులు కలిసి పనిచేయాలని కోరారు. ఈ భేటీ స్నేహపూర్వక వాతావరణంలో సాగింది. ఈ కార్యక్రమంలో గోవింద్, రాము, భాస్కర్ రెడ్డి, భూపతి నాయక్ లు పాల్గొన్నారు.