
జయ్ న్యూస్, నందిపేట్: నందిపేట్ గ్రామ ముస్లిం కమిటీకి నూతన అధ్యక్షుడిగా షౌకతుల్ బారీ గారు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఆదివారం గ్రామ షాదీఖానాలో ముస్లిం పెద్దలు, సభ్యుల సమక్షంలో నిర్వహించిన సమావేశంలో ఈ ఎన్నికలు జరిగాయి. సభలో పాల్గొన్న గ్రామ ముస్లింలు సమ్మతితో షౌకతుల్ బారీని అధ్యక్షునిగా, సయ్యద్ జమీల్ను ఉపాధ్యక్షుడిగా ఎన్నుకున్నారు. ఇప్పటివరకు కమిటీ అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వర్తించిన అహ్మద్ ఖాన్ పదవీకాలం ముగియడంతో ఈ ఎన్నికలు నిర్వహించామని కమిటీ సభ్యులు తెలిపారు. పూర్తి కార్యవర్గాన్ని త్వరలో నిర్వహించనున్న మరో సమావేశంలో ఎంపిక చేయనున్నట్లు వెల్లడించారు. ఈ సందర్భంగా షౌకతుల్ బారీ మాట్లాడుతూ, గ్రామాభివృద్ధికి తనవంతు కృషి చేస్తానని, తనను ఈ బాధ్యతకు ఎన్నుకున్న ముస్లిం సమాజానికి కృతజ్ఞతలు తెలిపారు.