
జయ్ న్యూస్, ఆర్మూర్: పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో పోగొట్టుకున్న మొబైల్ ఫోన్లను CEIR పోర్టల్ ద్వారా రికవరీ చేసి బాధితులకు 7 మొబైల్ ఫోన్లను గురువారం పట్టణ పోలీస్ స్టేషన్లో అందజేయడం జరిగిందని సీఐ సత్యనారాయణ గౌడ్ తెలిపారు. ఆయన మాట్లాడుతూ మహిపాల్, హరికృష్ణ, మొహమ్మద్ షాహిద్, అయాన్, నరసింహులు, నవీన్, శ్యామల లకు తాము పోగొట్టుకున్న మొబైల్ ఫోన్ లను అందజేశామని తెలిపారు. ఈ సందర్భంగా బాధితులు సీఐ సత్యనారాయణ కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు