
జయ్ న్యూస్, ఆర్మూర్: పసుపు బోర్డు కార్యాలయం నిజామాబాదు లో ఏర్పాటు కావడం ఒక చారిత్రాత్మక నిర్ణయమని, రైతులకు ఇచ్చిన మాట ప్రకారం పసుపు బోర్డు ఏర్పాటు చేసి, ఒక ఆదర్శ గ్రామం లో జన్మించిన, మన యువ నాయకులు, రైతు బిడ్డ, రైతు అయిన పల్లె గంగా రెడ్డిని జాతీయ పసుపు బోర్డు ఛైర్మెన్ గా నియమించి, నిజామాబాద్ నడి బొడ్డున కార్యాలయం ఏర్పాటు చేయడం గొప్ప విషయమని బీజేపీ జిల్లా అధికార ప్రతినిధి కలిగొట్ గంగాధర్ అన్నారు. ధర్మపురి అరవింద్ ని చూస్తుంటే ఒకటి గుర్తుకొస్తుంది… చేయాలని సంకల్పం, సాధించాలని పట్టుదల ఉంటే ఏదైనా సాధ్యం అని మోడీజీ నాయకత్వంలో నిరూపించారు. ప్రతి పక్షాలు అసాధ్యం అన్నారు.. ఇది సాధ్యం అని నిరూపించారు ధర్మపురి అరవింద్. ఎందరో నాయకులు ఓట్ల కొరకు వాగ్దానలు చేసి గెలిచిన తరువాత మరచి పోతారు కానీ ధర్మపురి అరవింద్ ఓట్ల కొరకు రాజకీయం చేయకుండా గెలిచిన తరువాత రైతులకు ఇచ్చిన మాట ప్రకారం తన సంకల్ప చిత్త శుద్ధితో సాధించి రాజకీయ సేవా అంటే ఇలా ఉంటుంది అని నిరూపించి రైతు పక్ష పాతి అయ్యారు ధర్మపురి అరవింద్. మోడీజీకి మన లోకసభ సభ్యులు ధర్మపురి అరవింద్ అంటే అపార నమ్మకం అని, తన పార్లమెంట్ పరిధి ప్రజల సమస్యల పరిష్కారం కొరకు ముందుంటారని పేర్కొన్నారు. అవినీతిలో కురుకుపోయిన గత BRS ప్రభుత్వం, ఎన్నికల్లో హామీలిచ్చి ప్రజా సంక్షేమాన్ని మరచిన కాంగ్రెస్ ప్రభుత్వనికి ప్రజలు త్వరలో బుద్ది చెపుతారని ఉన్నారు. అభివృద్ధి, ప్రజా సంక్షేమం అంటే బీజేపీతోనే సాధ్యం అని ప్రజలు విశ్వశిస్తున్నారని ఆయన పేర్కొన్నారు.