
జయ్ న్యూస్, ఆర్మూర్: మండలంలోని అంకాపూర్ లో గల లాలన వృద్ధాశ్రమము మరియు పొద్దుటూరి సదానంద్ రెడ్డి వృద్ధాశ్రమంలో దేగాం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆధ్వర్యంలో ఉచిత ఆరోగ్య శిబిరాన్ని శుక్రవారం నిర్వహించామని మెడికల్ ఆఫీసర్ డాక్టర్ ఆయేషా తెలిపారు. ఈ సందర్భంగా డాక్టర్ ఆయేషా మాట్లాడుతూ లాలన వృద్ధాశ్రమంలో 33 మందికి మరియు పొద్దుటూరి సాదానంద రెడ్డి వృద్ధాశ్రమంలో 40 మంది వృద్ధులకు వైద్య పరీక్షలు నిర్వహించినట్లు తెలిపారు. ఇందులో బిపి, షుగర్ మరియు ఇతర చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు ఉన్నవారికి ఉచితంగా మందులను పంపిణీ చేయడం జరిగిందని అదేవిధంగా ప్రతిరోజు చిన్న చిన్న యోగ ఆసనాలు, వ్యాయామం చేయాలని వృద్ధులకు సూచించామని తెలిపారు. ఈ కార్యక్రమంలో పిహెచ్ఎన్ వల్లి, ఆరోగ్య కార్యకర్తలు రాజ్యలక్ష్మి, రేఖ, ఆశ కార్యకర్తలు జయలక్ష్మి, విజయ వృద్ధులు తదితరులు పాల్గొన్నారు.