
జయ్ న్యూస్, ఆర్మూర్: డాక్టర్లను సస్పెండ్ చేయడం హేయమైన చర్య అని, వారిని సస్పెండ్ చేయడాన్ని తెలంగాణ ప్రభుత్వ డాక్టర్ల అసోసియేషన్ సెంట్రల్ ఎగ్జిక్యూటివ్ సభ్యులు డాక్టర్ నాగరాజు, డాక్టర్ రమేష్ లు ఖండిస్తున్నామన్నారు. ఇటీవల జహీరాబాద్ లో జరిగిన ఘటనపై తెలంగాణ ప్రభుత్వ వైద్యుల సంఘం ఆధ్వర్యంలో ఘాటుగా స్పందించారు. వారు మాట్లాడుతూ, ఇటీవల జహీరాబాద్లో జరిగిన ఘటన నేపథ్యంలో డాక్టర్లను తక్షణంగా సస్పెండ్ చేయడం పట్ల తెలంగాణ ప్రభుత్వ డాక్టర్ల అసోసియేషన్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తోందని వారు పేర్కొన్నారు.