
జయ్ న్యూస్, నిజామాబాద్: నిజామాబాద్ ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలలో ఇంగ్లీష్ అధ్యాపకురాలుగా పనిచేస్తున్న స్వర్ణ అనారోగ్యంతో హైదరాబాద్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం మృతి చెందింది. నిజామాబాద్ మూల్యాంకన కేంద్రంలో ఆమె చిత్ర పటానికి జిల్లా ఇంటర్ విద్యా అధికారి తిరుమలపుడి రవికుమార్ పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఆయన మాట్లాడుతూ మంచి అధ్యాపకురాలిగా గుర్తింపు తెచ్చుకున్న స్వర్ణ అకాల మరణం ఇంటర్ విద్య వ్యవస్థకు తీరని లోటని అన్నారు. అలాగే ప్రభుత్వ జూనియర్ అధ్యాపకుల సంఘం జిల్లా అధ్యక్షులు నర్సయ్య, పలువురు ప్రిన్సిపాల్ లు, అధ్యాపకులు ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించి సంతాపం ప్రకటించారు.