
జయ్ న్యూస్, ధర్పల్లి: నిజామాబాద్ జిల్లా ధర్పల్లి మండల కేంద్రంలోని ఆయా గ్రామాలలో మంగళవారం నుండి భూ భారతి గ్రామ రెవిన్యూ సదస్సు నిర్వహించడం జరుగుతుందని తహసిల్దార్ శాంత తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ… భూ సమస్యలు ఏదీ ఉన్న ఈ సదస్సులో అప్లికేషన్ చేసుకోవాలని, సాదా బైనమా, అసైన్మెంట్ ల్యాండ్ తదితర భూ సమస్యలన్నీ కూడా ఈ భూభారతి ద్వారా పరిష్కారం చేయడం జరుగుతుందని, దీనికి సంబంధించిన పత్రాలను జత పరచాలని సూచించారు. ప్రతి గ్రామానికి రెండు రోజుల సమయం ఉంటుందని, మీరు ఈ రెండు రోజులలో అందుబాటులో లేకున్నా మిగతా గ్రామాల్లో ఎక్కడైతే ఈ సదస్సు నిర్వహిస్తామో అక్కడికి అప్లికేషన్ తీసుకొచ్చి ఇవ్వచ్చని ఆమె అన్నారు. ఈ అవకాశాన్ని మండల ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.