
జయ్ న్యూస్, ఆర్మూర్: బక్రీద్ పండుగ సందర్భంగా పశువుల అక్రమ రవాణా జరగకుండా ఆర్మూర్ మున్సిపల్ పరిధి మామిడిపల్లి చౌరస్తాలో చెక్ పోస్ట్ ఏర్పాటు చేయడం జరిగిందని పట్టణ సీఐ సత్యనారాయణ గౌడ్ తెలిపారు. సోమవారం చెక్ పోస్ట్ ను పట్టణ సీఐ సత్యనారాయణ గౌడ్ తనిఖీ చేసి పోలీస్ అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఆయన మాట్లాడుతూ చెక్ పోస్ట్ వద్ద 24 గంటలు తనిఖీలు నిర్వహించబడుతుందని తెలిపారు.